YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Saturday, April 05, 2025

Friday, 26 October 2012

29న భువనగిరిలో వైఎస్సార్ సీపీలో జిట్టా చేరిక


హైదరాబాద్, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న భువన గిరిలో తలపెట్టిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్టికల్ 3 ప్రకారమే కేంద్రం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జిట్టా డిమాండ్ చేశారు. తెలంగాణపై జగన్ చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!