YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 16 June 2012

దేశంలో కీలక నేతగా జగన్: ఎంపీ మేకపాటి

యువనేత వైఎస్ జగన్ ను కాంగ్రెస్ చేజేతులారా దూరం చేసుకుందని నెల్లూరు ఎంపీగా ఎన్నికయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ తన శక్తి ఎంటో రుజువు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. జగన్ సత్తా ఉన్న నాయకుడని, ఆయనను దూరం చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి చెప్పానని వెల్లడించారు. రాబోయే రోజుల్లో జగన్ దేశంలో కీలక నేతగా ఎదుగుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఉప ఎన్నికల్లో ప్రజా మద్దతుతో గెలిచామని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడడం వల్లే నర్సాపురం, రామచంద్రాపురంలో తమ పార్టీ ఓడిపోయిందన్నారు. పరకాలలో కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ కారణంగానే కొండా సురేఖ స్వల్ప మెజారిటీలో ఓడిపోయిందని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!