YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 22 July 2012

బాబు అక్రమాస్తులపై విజయమ్మ పిటిషన్ నేడు సుప్రీంలో విచారణ

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల అక్రమాస్తులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఫఖిర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. బాబు అండ్ కో అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తాను దాఖలు చేసిన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టివేయడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ విజయమ్మ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!