ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలపై జగతి పబ్లికేషన్ ఆడిటర్ విజయసాయిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే.. నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పరువునష్టం దావా వేశారు. తమపై ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment