కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ అధికార కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడింది. చాగలమర్రిలో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. శిరువెళ్లలో కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తుండటంతో వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదిలావుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్రెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ పోలింగ్ బూత్లో ఎన్నికల విధుల్లోని కానిస్టేబుల్ శ్రీనివాసులు (48) గుండెపోటుతో మృతి చెందారు. ఓటు వేసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉయ్యాలవాడకు చెందిన బాల సుబ్బాయమ్మ (65) అనే వృద్ధురాలు వడదెబ్బతో మరణించారు.
No comments:
Post a Comment