YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 12 June 2012

నరసాపురం..అత్యధిక పోలింగ్

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న 18 నియోజకవర్గాల్లో అతి చిన్న నియోజకవర్గమైన నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా)లో అత్యధిక పోలింగ్ శాతం నమోదుకావటం విశేషం. 2009 ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి మరొక శాతం పోలింగ్ పెరిగింది. మొగల్తూరులో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేయటంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గొంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన షామియానా టెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఎన్నికల సిబ్బంది తొలగించారు. 

మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లను క్యూలైన్లలో కలిసి అధికార కాంగ్రెస్ కార్యకర్తలు టిఫిన్, పలావ్ పొట్లాలు, కూల్‌డ్రింకులు అందించటంతో పాటు డబ్బులు పంపిణీ చేశారు. పలు బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్‌కుసహకరించారు. నరసాపురంలోని స్టేషన్‌పేట, టేలర్ హైస్కూలు, ఎన్టీఆర్ కాలనీ, సీతారాంపురం నార్త్, జగన్నాథపురం ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సరిచేశారు. మాధవాయిపాలెం, రుస్తుంబాద, వేములదీవి, చామకూరిపాలెం తదితర ప్రాంతాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!