YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 20 June 2012

పార్టీని కాకుండా ప్రజలను నమ్ముకున్నందుకే

మాజీమంత్రి, దివంగత నేత పి. జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి బుధవారం చంచల్‌గూడ జైలులో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి ప్రజాసంక్షేమానికి తమ జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనులన్నారు. పార్టీని కాకుండా ప్రజలను న
మ్ముకున్నం దుకే ఇద్దరు నేతలు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు.

పీజేఆర్ చారిటీస్ ట్రస్ట్ స్థాపించి ప్రజలకు సేవచేస్తున్న తనను గతంలో మహానేత వైఎస్ పిలిచి, ప్రత్యేకంగా అభినందించారన్నారు. ఉద్యమస్ఫూర్తితో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ఉద్యమబాట పట్టిన వైఎస్ జగన్ రాష్ట్ర మహానేతల జాబితాలో చేరారన్నారు. ప్రజాసమస్యపై పోరాటం చేసేందుకు సమయం వచ్చినప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!