వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం పార్టీకి చెందిన పలువురు నేతలు చంచల్గూడ జైల్లో కలిశారు. జగన్ ఎంతో మనోస్థైర్యంతో ఉన్నారని అంబటి రాంబాబు, జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు. సమీప భవిష్యత్లో పెద్ద ఎత్తున వివిధ పార్టీలనుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలసలు రావడం ఖాయమని వారు మీడియాతో అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షం అధికారపక్షం మరింత దగ్గరకు రాబోతున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment