YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 19 June 2012

పులివెందుల చేరుకున్న విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఉప ఎన్నికల అనంతరం మొదటిసారి పులివెందుల చేరుకున్నారు. ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వైఎస్ భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేశారు.

కాగా ఈరోజు సాయంత్రం 3గంటలకు తాగునీటి సమస్యపై మున్సిపల్ అధికారులతోను, 4 గంటలకు నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో విజయమ్మ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!