YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 3 September 2012

6, 7 తేదీల్లో విజయమ్మ దీక్ష

పేద విద్యార్థులు అందరికీ ఫీజురీయింబర్స్ మెంట్ పథకం కింద మొత్తం ఫీజు చెల్లించాలన్న డిమాండ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 6,7 తేదీలలో ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపడతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. పేదవారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవిద్యార్థులను, పెద్ద విద్యార్థులను విడదీయడం మంచిదికాదన్నారు.

వెన్నుపోటులో పుట్టిపెరిగిన పార్టీ టీడీపీ అని, ఆ పార్టీకి వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ కుటుంబాన్ని సాధిస్తూ, ఆయనను మహానేత అనిపొగడటం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఆయన విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!