YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 6 September 2012

రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ మేకపాటి

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌ని వైఎస్ఆర్ సీపీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 

నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేపనులను వేగవంతం చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు. కావలిలో హౌరా-యశ్వంత్‌పూర్, శబరి, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని, బిట్రకుంటలో పినాకినిని, నెల్లూరులో కోరమాండల్, తమిళనాడు, గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలంటూ ముకుల్‌రాయ్‌ని ఎంపీ మేకపాటి కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!