YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 4 September 2012

ఎన్నికలు ఎప్పుడైనా వైఎస్సార్‌సీపీ సిద్ధం

ఆధారాల్లేకుండా ఇంకెంత కాలం జగన్‌ను జైల్లో పెడతారు

పులివెందుల(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని పార్టీలకంటే బలమైన పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొంటాం’ అని వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ తేల్చి చెప్పారు. మంగళవారం పులివెందులలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి 9, 10 నెలలుగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.. మూడు నెలలుగా జైలులో పెట్టారు.. ఈరోజు 100వ రోజు.. ఆధారాలు చూపించకుండా ఎన్నిరోజులు పెడతారు.. ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా జైలులో పెట్టారు’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకే కాదు అందరికీ భరోసా ఉండేదని.. ప్రస్తుతం ప్రభుత్వం సమస్యల వలయంలో చిక్కి అల్లాడుతోందని విమర్శించారు. కుల, మతాలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు మహానేత వైఎస్‌ఆర్ అందించారన్నారు. త్వరలోనే యువనేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్ సువర్ణయుగం వస్తుందని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!