YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 4 September 2012

వైఎస్‌ను విమర్శిస్తున్న మంత్రులకు ఉప్పునూతల సూటి ప్రశ్న


భువనగిరి(నల్లగొండ), న్యూస్‌లైన్: వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడని కొనియాడిన మంత్రులకు ఆయన మరణం తర్వాత దయ్యమయ్యాడా అని మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ప్రశ్నిం చారు. భువనగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోని ముఖ్యమంత్రులంతా వైఎస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన సోనియాగాంధీకి.,వైఎస్‌ను కాటన్‌దొరతో పోల్చిన ప్రధానికి ఇప్పుడు తప్పుడు మనిషిగా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. తాను ఏ పదవులూ ఆశించడం లేదని, కేవలం జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడడానికి, ఆయనకు అవసరమయ్యే సలహాలు, సూచనలు చేయడానికే చేరుతున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!