
తిరుపతిలో టీడీపీ వారు విద్యుత్ సమస్యపై ఆందోళన చేయడాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబుకుగానీ ఆ పార్టీ వారికిగానీ ఫీజులు, విద్యుత్ పథకాల గురించి మాట్లాడ్డం కాదు కదా, ఉచ్ఛరించడానికి కూడా నైతికంగా అర్హత లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఫీజుల పథకం అస్తవ్యస్తంగా తయారవడంతో విద్యార్థి లోకంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని తమ పార్టీకి అనుకూలంగా మల్చుకునేందుకు రాజకీయ కోణంలో ఆందోళనకు దిగారే తప్ప మరొకందుకు కాదని ఆమె విమర్శించారు. బాబు పాలనలో స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఫీజులు కట్టలేక ఎలా సతమతం అయ్యారో తెలిసిందేనని పద్మ అన్నారు. అలాగే విద్యుత్ సమస్యపై పోరాటం చేసే హక్కుగానీ, మాట్లాడే అర్హత గానీ బాబుకు లేవని చెప్పారు. ‘వైఎస్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్పై మీరు చేసిన వ్యాఖ్యలేమిటి? ఎంత హేళనగా మాట్లాడారో మర్చి పోయారా? అసలు మీ హయాంలో విద్యుత్ సంక్షోభం వచ్చినపుడు మీరు తీసుకున్న చర్యలేమిటి? రైతులపై కేసులు పెట్టింది, వారిని జైళ్లల్లో పెడతామని బెదిరించిందీ గుర్తు లేదనుకుంటున్నారా? అసలు బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమకారులపై జరిగిన కాల్పుల గురించి ఏం సమాధానం చెబుతారు?’ అని నిలదీశారు.
No comments:
Post a Comment