గనుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో డెక్కన్ మినరల్స్ అనే సంస్థకు గనుల కేటాయింపులో మంత్రులు గల్లా అరుణ కుమారి, ఏరాసు ప్రతాపరెడ్డికి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కర్నూలు జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.
డెక్కన్ మినరల్స్ అనే సంస్థకు కర్నూలు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాలున్న 40 ఎకరాల భూమి కేటాయించారు. ప్రైవేట్ వ్యక్తికి లాభం చేకూర్చేలా మంత్రులు వ్యవహరించారని, వాళ్లకూ వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని తన పిటిషన్లో ప్రదీప్ కుమార్ ఆరోపించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు... మంత్రులకు నోటీసులు జారీ చేసింది. గల్లా అరుణ కుమారి గనుల శాఖ మంత్రి, ఏరాసు ప్రతాపరెడ్డిది కర్నూలు జిల్లా.
డెక్కన్ మినరల్స్ అనే సంస్థకు కర్నూలు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాలున్న 40 ఎకరాల భూమి కేటాయించారు. ప్రైవేట్ వ్యక్తికి లాభం చేకూర్చేలా మంత్రులు వ్యవహరించారని, వాళ్లకూ వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని తన పిటిషన్లో ప్రదీప్ కుమార్ ఆరోపించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు... మంత్రులకు నోటీసులు జారీ చేసింది. గల్లా అరుణ కుమారి గనుల శాఖ మంత్రి, ఏరాసు ప్రతాపరెడ్డిది కర్నూలు జిల్లా.
No comments:
Post a Comment