YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 19 June 2012

జగన్ తో ఎంపీ అసదుద్దీన్ భేటీ

ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు చంచల్‌గూడ జైలుకు వచ్చిన ఆయన ములాఖత్‌ అనుమతి తీసుకుని జగన్‌ను కలిశారు. దాదాపు గంట పాటు ఓవైసీ ములాఖత్‌ గదిలోనే ఉన్నారు. 

కేసుకు సంబంధించిన విషయాలతో పాటు, వ్యక్తిగత, రాజకీయ విషయాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించబోయే విషయాలను కూడా అసదుద్దిన్‌ చర్చించినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌కు మద్దతివ్వాల్సిందిగా జగన్‌ను కోరినట్టు అసదుద్దిన్‌ మీడియాకు తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!