కరీంనగర్ : కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు డిన్నర్లు, లంచ్ మీటింగ్ లు మానుకుని జైపాల్ రెడ్డి ఇంటిముందు బైఠాయించి తెలంగాణ సాధన కోసం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేయలేదని, కాంగ్రెస్, టీడీపీలపై వ్యతిరేకతతో పాటు జగన్ పై గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఓటర్లు కసిగా ఓటేశారన్నారు. సెమీ ఫైనల్స్ ఫలితాలు సానుభూతి, పాలపొంగు లాంటివని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గోనె సవాల్ విసిరారు.
ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేయలేదని, కాంగ్రెస్, టీడీపీలపై వ్యతిరేకతతో పాటు జగన్ పై గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఓటర్లు కసిగా ఓటేశారన్నారు. సెమీ ఫైనల్స్ ఫలితాలు సానుభూతి, పాలపొంగు లాంటివని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గోనె సవాల్ విసిరారు.
No comments:
Post a Comment