నల్లగొండ జిల్లా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఈద దేవయ్య అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. ఈద దేవయ్య వయసు 59 ఏళ్లు. 1983- 84లో ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీలో అనేక పదవులు అదిరోహించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్గా పని చేస్తున్నారు. ఈద దేవయ్యకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవయ్య మృతి పట్ల పార్టీ నేతలతో పాటు, పలువురు సంతాపం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment