YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 11 July 2012

జగన్ కేసులో అనుబంధ ఛార్జీషీట్ తిరస్కరణ

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అనుబంధ ఛార్జీషీట్ ను సిబిఐ కోర్టు తిరస్కరించింది.ఛార్జీ షీట్ లో తప్పులు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.గతంలో కూడా సిబిఐ ఎమ్.ఆర్., ఒఎమ్సీ కేసులలో కూడా ఛార్జీషీట్లను కోర్టు తిప్పి పంపి మరోసారి వేయించింది. ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సిబిఐ కేసులలో ఇలా జరగడం ఆ సంస్థకు అప్రతిష్టగానే భావిస్తున్నారు. నాలుగు కంపెనీల పేర్లను నిందితులుగా చేర్చారని, కాని కంపెనీల ప్రతినిదుల పేర్లను చేర్చకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. కొన్ని సాంకేతిక లోటుపాట్లు ఉన్నాయని, పూర్తిగా సవరించి పంపాలని కోర్టు ఆదేశించింది.


source:kommineni

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!