అట్లాంటా: అమెరికా అట్లాంటాలో జరుగుతున్న ఆటా ఉత్సవాలలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆటాలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పల్లంరాజు, ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, ఆటా అధ్యక్షుడు రాజేందర్ దిన్నా, ఆటా కన్వీనర్ అక్కిరెడ్డి, గోనెప్రకాశ్, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లంరాజు మాట్లాడుతూ.. వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం అని అన్నారు. రాజకీయాల్లో వైఎస్ గొప్ప పోరాటయోధుడని పల్లంరాజు వ్యాఖ్యానించారు. పాదయాత్ర ద్వారా వైఎస్ కాంగ్రెస్కు బలాన్ని ఇచ్చారని, నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయని తత్వం వైఎస్ది అని పల్లంరాజు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment