YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 13 July 2012

నేటి నుంచి రాజన్న బాట

నా బాట రాజన్న బాట.. నా మాట జగనన్న మాట.. అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం మండల పర్యటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి చేపట్టనున్న ఇందిరమ్మ బాటకు ఓ రోజు ముందుగానే ఆయన రాజన్నబాట ప్రారంభిస్తున్నట్లు రాజవరంలో ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి అన్ని శాఖల ప్రభుత్వాధికారులను కలుపుకుంటూ రాజవరం, యర్రంపేట, పొంగుటూరు పంచాయతీల్లోని 9 గ్రామాల్లో ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిధులు ఉండి కూడా అధికారులు అలసత్వంతో ఇందిర జలప్రభ నిష్ర్పయోజనంగా మారుతోందని పేర్కొన్నారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో నిధులుకేటాయింపులకు ప్రభుత్వాన్ని నిలదీస్తానని, ఈ విషయంలోరాజీపడబోనని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ బాట ఉన్నన్నాళ్లూ రాజన్నబాటగానే గ్రామగ్రామాన పర్యటిస్తానని తెలిపారు. రాజవరం దళితపేటలో స్థానికులు ఏర్పాటుచేసుకున్న మహానేత వైఎస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలకు ముందు 2,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరుచేశారని, ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగుతు, ఇప్పటి వరకు వాటిని ఇవ్వలేదని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!