మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో ఒక ఫిలాసఫీని రూపొందించారని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం అంటే ఎలా ఉండాలో చేతల్లో చూపింది వైఎస్ మాత్రమే అని గట్టు అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రజా పక్షంగా పోరాడుతుందన్నారు. వైఎస్ జయంతిని కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని గట్టు మండిపడ్డారు. ప్రతి కుటుంబం వైఎస్ను స్మరించుకుందని... వైఎస్ఆర్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకున్నారని గట్టు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment