YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మహానేత వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందిన విద్యార్ధులు వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ పెద్దలు కక్ష సాధింపుకు దిగారన్నారు. కుట్రలతో వైఎస్‌ జగన్‌ను అరెస్టు చేయించారన్నారు. వైఎస్‌ మరణం తర్వాత మూడేళ్లలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ఆశయాలను ప్రతి కార్యకర్తా కార్యకర్తా ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే బాలరాజు పిలుపు ఇచ్చారు. 

రాజమండ్రి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వైఎస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చివరి క్షణం వరకు పేదల సంక్షేమం కోసం పరితపించిన మహానేత... వైఎస్‌ అని కొనియాడారు. మహానేత చూపిన బాటలో నడుస్తూ.. ఆయన పధకాలను కొనసాగిస్తామని ప్రతిన పూనారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆదివారం స్థానిక మెయిన్ రోడ్డులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ షిప్ లోని వైఎస్ఆర్ కాలనీలో మహానేత వైఎస్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కొయ్యే మోషెన్ రాజు ప్రారంభించారు.

వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం, మెగావైద్య శిబిరం ప్రారంభించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఆదివారం వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామా డ్రామాను ప్రజలు నమ్మరన్నారు. 

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!