ఆంధ్రప్రదేశ్లో అధికార కాంగ్రెస్తో రెండున్నరేళ్లుగా మ్యాచ్ఫిక్సింగ్ కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ నేతలతో సోమవారం సమావేశమైన అధ్యక్షుడు చంద్రబాబు, యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తే ఎలా ఉంటుందంటూ ఆరా తీశారు. కానీ ఒకరిద్దరు పార్టీ సీనియర్లు దాన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. అన్ని విషయాల్లో కాంగ్రెస్కు సహకరిస్తూ ఇప్పటికే పార్టీని దెబ్బ తీసుకున్నామని వారు గట్టిగా వాదించినట్టు తెలిసింది. అయినా ప్రణబ్కు మద్దతిస్తున్నట్టు సోమవారం మధ్యాహ్నమే ఎల్లో మీడియాకు టీడీపీ కార్యాలయం లీకులిచ్చింది. ఎన్డీయే ఇంకా అభ్యర్థిని ప్రకటించని నేపథ్యంలో, ప్రణ బ్కు మద్దతివ్వాలని నిర్ణయిస్తే ఎవరెలా స్పందిస్తారో తెలుసుకునేందుకే అలా లీకులిచ్చినట్టు బాబు చెప్పారని పార్టీ వర్గాలన్నాయి. స్పందనలను బట్టి ఓ నిర్ణయానికి వస్తామని, ఆలోగా రాష్ట్రపతి రేసులో ఎవరెవరుండేదీ తేలిపోతుంది గనుక తమ పని సులువవుతందని భేటీలో పాల్గొన్న నాయకుడొకరు చెప్పారు!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment