అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీ గురునాథరెడ్డి తరఫున ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 5న (రేపు) అనంతపురం నగరంలో రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజక వర్గ ఎన్నికల పరిశీలకులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తెలిపారు. నగరంలో వైఎస్ విజయమ్మ పర్యటించే రూట్ మ్యాప్ను ఆదివారం సాయంత్రం ఆయన విడుదల చేశారు. మధ్యాహ్నం వరకు అనంతపురం ఆ తరువాత రాయదుర్గం నియోజక వర్గంలో పర్యటిస్తారన్నారు.
నగరంలో విజయమ్మ పర్యటన ఇలా...
ఉదయం 9 గంటలకు కలెక్టర్ కార్యాలయం, 9.30 గంటలకు పవర్ఆఫీసు, 10 గంటలకు తాడిపత్రి బస్టాండ్ సర్కిల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 11 గంటలకు నీలం థియేటర్ మీదుగా సూర్యనగర్లో రోడ్షో నిర్వహిస్తారన్నారు. 11.30 గంటలకు సాయినగర్, అంబేద్కర్భవన్ మీదుగా రోడ్షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వాసుపత్రి (పెద్దాసుపత్రి), కోర్టురోడ్ మీదుగా 12.30 గంటలకు గుల్జార్పేటకు చేరకుని రోడ్ నిర్వహిస్తారన్నారు. 1.30 గంటలకు సప్తగిరి సర్కిల్ సమీపంలో ‘వై’ జంక్షన్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. 2 గంటలకు అరవిందనగర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీ గురునాథరెడ్డి నివాసానికి చేరుకుంటారని తెలిపారు.
నగరంలో విజయమ్మ పర్యటన ఇలా...
ఉదయం 9 గంటలకు కలెక్టర్ కార్యాలయం, 9.30 గంటలకు పవర్ఆఫీసు, 10 గంటలకు తాడిపత్రి బస్టాండ్ సర్కిల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 11 గంటలకు నీలం థియేటర్ మీదుగా సూర్యనగర్లో రోడ్షో నిర్వహిస్తారన్నారు. 11.30 గంటలకు సాయినగర్, అంబేద్కర్భవన్ మీదుగా రోడ్షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వాసుపత్రి (పెద్దాసుపత్రి), కోర్టురోడ్ మీదుగా 12.30 గంటలకు గుల్జార్పేటకు చేరకుని రోడ్ నిర్వహిస్తారన్నారు. 1.30 గంటలకు సప్తగిరి సర్కిల్ సమీపంలో ‘వై’ జంక్షన్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. 2 గంటలకు అరవిందనగర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీ గురునాథరెడ్డి నివాసానికి చేరుకుంటారని తెలిపారు.
No comments:
Post a Comment