YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

దేశమంతా చూస్తున్న ఎన్నికలు ఇవి: విజయమ్మ

దేశమంతా ఈ ఎన్నికలనే చూస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్డుర్తిలో ఈరోజు ఆమె తన కుమార్తె షర్మిలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశమంతా 45 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందని, కానీ మన ఒక్కరాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత దివంగత మహానేత డాక్టరై వైఎస్ఆర్ దని ఆమె తెలిపారు. గుంటూరు జిల్లా అంటే వైఎస్ కు ఎంతో మమకారం అన్నారు. 

తాను ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే బయటకు వస్తానని జగన్ చెప్పినట్లు ఆమె తెలిపారు. భర్తను పోగొట్టుకుని, బిడ్డను జైల్లో పెట్టుకుని న్యాయంకోసం మీ ముందుకు వచ్చానని ఓటర్లను ఉద్దేశించి ఆమె అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!