YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 4 June 2012

మూడోరోజు జగన్ ను విచారిస్తున్న సీబీఐ

హైదరాబాద్ : మూడోరోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రత్యేక వాహనంలో సీబీఐ అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని తమ కార్యాలయానికి తీసుకెళ్ళారు.

ఐదురోజుల కస్టడీలో భాగంగా ఆదివారం మొదలైన ఈ విచారణ గురువారం దాకా కొనసాగుతుంది. మరోవైపు సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ సజ్జల రామకృష్ణారెడ్డికి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కూడా సమన్లు వచ్చాయి. వీరిద్దరూ కూడా ఈ ఉదయమే కోఠి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!