ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ సమాధిపై పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. విజయమ్మతో పాటు కుమార్తె షర్మిల కూడా వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందుల నుంచి ఆమె ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
Monday, 4 June 2012
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment