YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

వైఎస్ మరణంపై విచారణ జరపాలి

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని.. వాటిపై విచారణ చేయిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహానేత మూడో వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆత్మకూరు సమీపంలోని స్మృతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ సతీమణి విజయమ్మ కూడా ప్రభుత్వాన్ని ఇదే కోరారని ఆయన గుర్తు చేశారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి, తట్టుకోలేని ప్రభుత్వం.. సీబీఐని అడ్డం పెట్టుకొని అన్యాయంగా జైల్లో ఉంచింది. కనీసం తండ్రి వర్ధంతి వేడుకలకు హాజరు కాకుండా చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయితేనే మహానేత పథకాలు తిరిగి అమలవుతాయన్నారు. వైఎస్ గురించి చెబుతూ.. వై.వి.సుబ్బారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!