YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

నేడు కర్నూలు జిల్లాకు విజయమ్మ

కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుతో లబ్ధి పొందాలనుకుంటున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఆమె రాకతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భా గంగా మొదట విడతగా జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మూడు రో జులు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెండు రో జుల పాటు పర్యటించారు. 

18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐచే గత నెల 27వ తేదీన జగన్‌ను అరెస్టు చేయించడం తెలిసిందే. త ద్వారా లబ్ధి పొందాలని ఆశించిన ఆ రెండు పార్టీలకు విజయమ్మ ప్రచారం మింగుడుపడ టం లేదు. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజ లు తండోపతండాలుగా తరలివస్తుండటం తో వారు షాక్‌కు గురవుతున్నారు. బుధవా రం ఉదయం 10 గంటలకు ఎమ్మిగనూరు ప ట్టణంలో విజయమ్మతో పాటు ఆమె కుమార్తె షర్మిల రోడ్‌షో నిర్వహించనున్నారు. 

సోమ ప్ప సర్కిల్, యంబి చర్చి ఏరియాలో ప్రసంగించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో రోడ్‌షోగా మండల కేంద్రమైన గోనెగండ్ల చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆళ్లగడ్డకు చేరుకొని రో డ్‌షోలో పాల్గొంటారు. అక్కడి నాలుగు రోడ్ల కూడలిలో ప్రసంగించిన అనంతరం ప్రధాన వీధుల్లో రోడ్‌షో నిర్వహిస్తారని ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రఘురాం, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డిలు తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!