YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

న్యాయం కోసం మీముందుకొచ్చా: విజయమ్మ

కందుకూరు : నోరుంది కదా అని ఎలాపడితే అలా మాట్లాడితే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కొంతమంది వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రసంగించారు. వైఎస్ ను తామే చంపుకున్నామని, తమపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు.

వైఎస్ మృతిపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే న్యాయం కోసం తాను ఇల్లు దాటి బయటకు వచ్చానని, అంతే తప్పా తనకు అధికార దాహం లేదని విజయమ్మ స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేసేవాళ్లట... ఆపార్టీలో ఉంటే జగన్ నిర్ధోషి అయ్యేవాడట' అని ఆమె అన్నారు. 

జగన్ ను అరెస్ట్ చేస్తే నిరసన తెలియచేసే అవకాశం కూడా తనకు ఇవ్వలేదన్నారు. ఆఖరికి తన సూట్ కేసు కూడా సోదాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనమేమైనా పాకిస్తాన్ లో ఉన్నామా అని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. న్యాయ నిర్ణేతలు అయిన మీరే తీర్పు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. వైఎస్ఆర్ సీసీకి ఓట్లు వేస్తే ప్రజలను కూడా చంద్రబాబు జైల్లో పెట్టిస్తారట... బాబుతో జాగ్రత్తగా ఉండాలని విజయమ్మ సూచించారు.

ఫ్యాన్ గుర్తుకు వేసే ఓటు రాజన్నకు ఓటు వేసినట్లేనని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ ఉంటే సోమశిల ప్రాజెక్టు, రాళ్లపాడు రిజర్వాయర్ ను అనుసంధానం చేసేవారని ఆమె గుర్తు చేశారు. రూ. 1300 కోట్ల బకాయిలు రద్దుచేసిన రైతు పక్షపాతి వైఎస్ఆర్ అన్నారు. వైఎస్ హయాంలో ఎన్నడూ పన్నులు, ఛార్జీలను ప్రజలపై మోపలేదని విజయమ్మ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!