హైదరాబాద్, న్యూస్లైన్:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంతటి ఆర్థిక నేరస్తుడు, దుర్మార్గుడు ఈ ప్రపంచంలోనే లేరని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు బాబు అని దుయ్యబట్టింది. ఆదివారమిక్కడ సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో సింగపూర్లో హోటల్ను నిర్మించడంతోపాటు వేల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కూడగట్టారని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను పక్కదారి పట్టించిన ముఖ్యమంత్రి కూడా చంద్రబాబేనన్నారు. ప్రభుత్వ ఆస్తులను, వేలాది ఎకరాల భూములను అప్పనంగా విక్రయించిన చరిత్ర ఆయనదేనని.. అలాంటి వ్యక్తి ఈరోజు రైతుల వద్దకు వెళ్లి మొసలికన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. భూముల కేటాయింపుల్లో తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవడంతోపాటు ఆయా భూములను వెనక్కు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన హయాంలో జరిగిన తప్పులకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై మీ పార్టీ నేత కేసు వేశారు కదా.. అదే విధంగా చంద్రబాబు ఆస్తులపైనా కేసు వేసేందుకు మీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారా? అని విలేకరులు అడగ్గా.. తనకు న్యాయ వ్యవస్థ, కేసులకు సంబంధించి పెద్దగా అవగాహన లేదని, అయితే చంద్రబాబు అక్రమాస్తులపై మాత్రం గట్టిగా పోరాడతామని చెప్పారు.
When the Congress has decided to say YSR is wrong; TD head got strength, to say unlimited on YSJMR. Indirectly Congress is encouraging INHUMANITY.
ReplyDelete