YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

జన సంద్రమైన ప్రత్తిపాడు

ప్రత్తిపాడు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి విజయమ్మ రోడ్‌షోలకు జనం నీరాజనం పడుతున్నారు. రోడ్‌షోలో భాగంగా ఆదివారం రాత్రి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు చేరుకున్న విజయమ్మకు ఘనస్వాగతం లభించింది. ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జగన్ ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారని విజయమ్మ ప్రశ్నించారు. టీడీపీ-కాంగ్రెస్‌లో కుమ్మక్కై జగన్ బాబును అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వాళ్ల ఎత్తులను తిప్పికొట్టాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. 

ఆ మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏనాడు జగన్ క్యాంపు ఆఫీస్‌కు వెళ్లలేదని, ఏరకంగా తప్పు చేశాడని నిర్ధారిస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. విజయమ్మ ప్రసంగానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆమె ప్రసంగిస్తున్నంతసేపు ప్రజలు ఆసక్తిగా విన్నారు. షర్మిల కూడా తల్లి విజయమ్మ వెంటే ఉన్నారు. అన్న జగన్ అరెస్టు సీబీఐ-కాంగ్రెస్‌ల కుట్రలో భాగమేనని తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!