ఒంగోలు: మంత్రులను, పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సిబిఐ జెడి లక్ష్మీనారాయణ బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా చెప్పమని వేధిస్తున్నారన్నారు. రాజీవ్ హత్యకేసులో నళినికి సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టారు. అంటే సోనియాకు, నళినికి పొత్తు ఉన్నట్లా? అని ఆయన ప్రశ్నించారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజకీయాలు మాని బ్రాందీషాపు పెట్టుకుంటే మంచిదన్నారు. జగన్ పై కుట్ర వెనుక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సోనియా హస్తం ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం చేతిలో చీపురుకట్టలా సీబీఐ తయారయిందన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజకీయాలు మాని బ్రాందీషాపు పెట్టుకుంటే మంచిదన్నారు. జగన్ పై కుట్ర వెనుక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సోనియా హస్తం ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం చేతిలో చీపురుకట్టలా సీబీఐ తయారయిందన్నారు.
No comments:
Post a Comment