కందుకూరు : రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలపించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పిలుపునిచ్చారు. సోమవారం ప్రకాశం జిల్లాలో తల్లి విజయమ్మతో కలిసి ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరులో షర్మిల మాట్లాడుతూ జగనన్నను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జగనన్న తప్పు చేశాడనటానికి ఆధారాలున్నాయా అని ఆమె ప్రశ్నించారు. గత రెండేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారని, సీబీఐ కేంద్రం కనుసన్నల్లో పని చేస్తోందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె మండిపడ్డారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అడగడుగునా విజయమ్మకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
జగనన్న తప్పు చేశాడనటానికి ఆధారాలున్నాయా అని ఆమె ప్రశ్నించారు. గత రెండేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారని, సీబీఐ కేంద్రం కనుసన్నల్లో పని చేస్తోందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె మండిపడ్డారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అడగడుగునా విజయమ్మకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
No comments:
Post a Comment