ఆత్మకూరు: నెల్లూరు జిల్లా వింజమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ఘనస్వాగతం లభించింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన విజయమ్మ, షర్మిలలను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. వింజమూరు జనసంద్రమైంది. ఈ సందర్భంగా షర్మిల చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
ప్రచార వాహనంపై విజయమ్మ, షర్మిలలతోపాటు లోక్ సభ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి, శాసనసభ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి ఉన్నారు.
ఈ రోజు ప్రచారంలో విజయమ్మ, షర్మిలలకు అడుగడుగునా జననీరాజనం పలికారు. ఆడపడుచుల ఆశీర్వచనాలు అందుకుంటూ వారు ముందుకు సాగిపోతున్నారు.
ప్రచార వాహనంపై విజయమ్మ, షర్మిలలతోపాటు లోక్ సభ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి, శాసనసభ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి ఉన్నారు.
ఈ రోజు ప్రచారంలో విజయమ్మ, షర్మిలలకు అడుగడుగునా జననీరాజనం పలికారు. ఆడపడుచుల ఆశీర్వచనాలు అందుకుంటూ వారు ముందుకు సాగిపోతున్నారు.
No comments:
Post a Comment