YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

లగడపాటిపై విజయవాడ న్యాయవాది ఫిర్యాదు


విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, అతని కుటుంబ సభ్యుల దాడి నుంచి కాపాడాలని విజయవాడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి హుడా లా అండ్ ఆర్డర్ డిజికి ఫిర్యాదు చేశారు. 2008 మే లో తనపై జరిగిన యాసిడ్ దాడి, రెండు దఫాలుగా సాక్ష్యాలతో సహా విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదుచేశానని తెలిపారు. సిపి పట్టించుకోకపోవడంతో కోర్టుకు ఫిర్యాదుచేసినట్లు చెప్పారు. ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు నిర్థారించినట్లు తెలిపారు. లగడపాటి కుటుంబసభ్యులు తనని చంపాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనని రోజూ వెంబడిస్తున్నట్లు తెలిపారు. తనకు ఏం జరిగినా లగడపాటి, అతని కుటుంబ సభ్యులదే బాధ్యత అని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!