తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అరెస్ట్ వెనుక కాంగ్రెస్ పెద్దల కుట్ర బట్టబయలు అయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. తిరుపతి, నెల్లూరులో ఆజాద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆజాద్ మాట్లాడిన తర్వాతే సిబిఐ పావులు కదిపిందని చెప్పారు. పధకం ప్రకారం జగన్ ని సిబిఐ అరెస్ట్ చేసిందన్నారు. అయితే వీరి కుట్రలు పటాపంచలు కాబోతున్నాయని, కాంగ్రెస్ పెద్దల దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే నేతలే కరువయ్యారని అంబటి చెప్పారు. ఢిల్లీ నుంచి ఆజాద్ లాంటి నేతలను రప్పించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే నేతలే కరువయ్యారని అంబటి చెప్పారు. ఢిల్లీ నుంచి ఆజాద్ లాంటి నేతలను రప్పించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు.
When the people have come to a conclusion that the original INC of YSR period died, what can these Azads do. Can they make a dead organism alive? Impossible. A lay man can understand better.
ReplyDelete