పాలకొల్లు: వైఎస్సార్ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం రాచరికానికి అద్దం పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్రంగా ఖండించారు. గతంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, రాజీవ్ను ప్రధాని చేయడం రాచరికం కాదా అని జోగయ్య కాంగ్రెస్ను సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు రాహుల్ను ప్రధానిగా తెరమీదకు తీసుకురావడం వారసత్వానికి నిదర్శనం కాదా? అని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను చేపట్టిన ఆజాద్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయమ్మ ప్రచారంతో ఉప ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాయమని జోగయ్య ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment