
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను నగరంలో పర్యటించినప్పుడు భర్తల తాగుడు కారణంగా పుస్తెలు తెగిపోయాయని, ఇల్లు గుల్లయిందని చాలామంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని చెప్పారు. తిరుపతి పవిత్రతను కాపాడడంతో పాటు మహిళల కన్నీరు తుడవడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్యని.. మానవీయకోణంలో చూడాల్సి ఉందన్నారు. తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని, ఏడాదికి రూ.190 కోట్లకుపైగా మద్యం వ్యాపారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
No comments:
Post a Comment