
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని అందుకే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని గట్టు మండిపడ్డారు. పాలకుల నిర్ణయాలతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఫీజుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కిరణ్ ప్రభుత్వానికి సిగ్గురావడంలేదన్నారు. పెంచిన ఫీజులను అర్హులందరికి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు అవార్డు: నిజాలను ఖూనీ చేస్తూ, అబద్ధాలను చె ప్పి వాటిని గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరుండరని, అందుకే ఆయనకు అవార్డు ప్రకటించాలని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యపై నిరసన తెలుపుతున్న వారిపై అన్యాయంగా కాల్పులు జరిపి నలుగురిని పొట్టనబెట్టుకున్న వ్యక్తి వికలాంగుల సభలో సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
తన తొమ్మిదేళ్లపాలనలో వికలాంగులను పట్టించుకోకుండా చిన్నచూపు చూసిన చంద్రబాబు అధికార దాహంకోసం వెర్రివేషాలేస్తున్నారని విమర్శించారు. బాబు హయాంలో వికలాంగుల పింఛన్ను కేవలం రూ.25 మాత్రమే పెంచి ఇచ్చే రూ.75ను మూడునెలలకొసారి ఇచ్చేవారని గుర్తుచేశారు. అలాంటిది దివంగత వైఎస్ మానవతా దృష్టితో వాటిని ఒక్కసారిగా రూ.200లకు ఆ తర్వాత 500లకు పెంచారన్నారు.
No comments:
Post a Comment