YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

10 నుంచి వైఎస్సార్‌సీపీ రెండో విడత సమీక్షలు

ఉప ఎన్నికల ఫలితాలపై ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో విడత సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. రెండోదఫా సమీక్షలో భాగంగా.. ఎస్.రఘురామిరెడ్డి, ఎం.వి.కృష్ణారావు, డి.రవీంద్రనాయక్‌తో కూడిన త్రిసభ్య కమిటీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, శ్రేణుల పనితీరు తదితర అంశాలను సమీక్షిస్తుంది.

పదోతేదీ నుంచి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు.. రోజుకు రెండేసి నియోజకవర్గాల చొప్పున ఈ సమీక్షలు జరుగుతాయి. 10న ఒంగోలు, తిరుపతి, 11న నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి అసెంబ్లీ, 12న రామచంద్రపురం, పాయకరావుపేట, 13న పోలవరం, నర్సాపురం, 14న పరకాల, నరసన్నపేట నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది. ఈ సమావేశాలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా కన్వీనర్లు, నియోజకవర్గాల, మండలాల పరిశీలకులు, మండల కన్వీనర్లు హాజరు కావాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కన్వీనర్ పి.ఎన్.వి.ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!