YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 5 July 2012

శరద్ పవార్ ను కలిసిన విజయమ్మ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కలిశారు. ఈసందర్బంగా ఆమె రైతు సమస్యల్ని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. .తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని విజయమ్మ కోరారు.

ఎరువుల ధరలు పెరగటంతో పాటు విత్తనాలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె కేంద్రమంత్రికి వివరించారు. కృషి భవన్ లో విజయమ్మ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం కేంద్ర వ్యవసాయశాఖమంత్రిని కలుసుకున్నారు. పవార్ ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!