YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 5 July 2012

నేడు వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ), కేంద్ర కార్య నిర్వాహక మండలి(సీఈసీ) విస్తృత సమావేశం శుక్రవారం జరగనుంది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీకి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షత వహిస్తారు. 

ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా పరిశీలకులు, జిల్లా కన్వీనర్లు హాజరు కానున్నట్లు సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో 170 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!