YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

ప్రధానితో భేటీ అయిన విజయమ్మ

న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దర్యాప్తు జరుగుతున్న తీరు, కక్షపూరిత ధోరణితో సీబీఐ వ్యవహరిస్తున్న వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తెచ్చింది. ఢిల్లీలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఈరోజు ఉదయం సౌత్‌ బ్లాక్‌లో ప్రధాని కార్యాలయంలో మన్మోహన్ తో భేటీ అయ్యారు. 

విజయమ్మ వెంట ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాల్సిన సీబీఐ... జగన్‌ను దోషిగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నుతోందని ప్రధానికి వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!