YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Wednesday, 30 May 2012

సీబీఐ జేడీతో టీడీపీ నేత భేటీ

సీబీఐ డెరైక్టర్‌గా పదవీ విరమణ చేసి, టీడీపీలో చిరకాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి ఒకరు బుధవారం ఓ ప్రముఖ హోటల్‌లో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, ఆ సంస్థ న్యాయవాదులతో సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్, టీడీపీ సంయుక్తంగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది. 

జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దుష్ర్పచారం చేస్తున్న ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇలా సీబీఐ జేడీతో, ఆ సంస్థ న్యాయవాదులతో సమావేశమవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సీనియర్ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలకు ఇది అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. సదరు నేత బుధవారం సాయంత్రం ఇక్కడి ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో సీబీఐ భేటీలో పాల్గొన్నట్లు ఆ సంస్థ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 

కేసుల పరిశోధనలో సహకారం కోసమే ఆయనను ఆహ్వానించినట్టు చెప్పుకొచ్చాయి. జగన్ కేసుతో ప్రత్యక్ష సంబంధమున్న రాజకీయ పార్టీ నేత నుంచి సహకారం తీసుకోవడం సీబీఐ వ్యవహార శైలికి అద్దం పట్టేలా ఉందని న్యాయవర్గాలు వ్యాఖ్యానించాయి. నిజానికి ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తొలినుంచీ సదరు నేత సలహాలు, సూచనల మేరకే జరగుతున్న వైనాన్ని సాక్షి ఇదివరకే వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!