
అయితే స్పీకర్ ఆమె రాజీనామాను ఆమోదించలేదు. అనంతరం గతేడాది డిసెంబర్లో రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలని కోరుతూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అసెంబ్లీ సభ్యత్వం నుంచి అనర్హతకు గురయ్యారు. తర్వాత గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి తుది కంటా పోరాడిన సురేఖ.. స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.


గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం కన్వీనర్గా ఉడుముల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉపాధి అవకాశాల కల్పన విభాగం కన్వీనర్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి(వీఎల్ఎన్ రెడ్డి)ని నియమించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశం జిల్లా చినారికట్ల గ్రామానికి చెందిన వీఎల్ఎన్.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎయిరో పార్క్(సెజ్) రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వైఎస్తో సన్నిహిత సంబంధాలు కల్గిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చిన్నతరహా పరిశ్రమల బోర్డు, ఎస్ఎస్ఐ(ఎంఎస్ఎంఇ), రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, రిజర్వు బ్యాంకు సాధికార కమిటీతో సహా పలు సంస్థల్లో సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు.
No comments:
Post a Comment