YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 30 September 2012

నేడు వైఎస్‌ఆర్‌ సీపీ రక్తదాన శిబిరాలు

హైదరాబాద్ : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ వైద్య విభాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేశారు.


నారాయణగూడలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రక్తదాన శిబిరానికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!