YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 6 October 2012

తెలుగువాడి ఆత్మ గౌరవం ,మాట కోసం...

వైఎస్సార్  చనిపోగానే అనుకున్నట్లు గానే ముందు  వైఎస్సార్  మంచివాడు,కానీ జగన్ కాదు అని ప్రచారం చేసారు,కానీ జగన్ జనం లో వుండడం వల్ల జనానికి జగన్  అంటే ఏంటో తెలిసి వచ్చింది.ఏమి చెయ్యాలో అర్ధం కాక  వైఎస్సార్   ని అవినీతిపరుడు అని చెప్పి జగన్ ని దెబ్బతియ్యలని చూసారు,అది జనం నమ్మలేదు.ఒక చోట నేరం జరిగిన తర్వాత దర్యాప్తు వుంటుంది.కానీ జగన్ అర్రెస్ట్ విషయం లో తప్పు జరిగే వుంటుంది,మేము అదే తేలుస్తాం,అప్పటి దాక జైలు లో వుండాలి అనే విధంగా జరుగుతుంది దర్యాప్తు.కొన్ని పార్టీ లు కుమ్మక్కు కి నిదర్శనమే ఈ దర్యాప్తు.మిగతా వాళ్ళని దర్యాప్తు చెయ్యడానికి సిబిఐ కి సిబ్బంది కూడా వుండరు,జగన్ విషయం లో ప్రత్యెక సిబ్బంది వుంటారు.

క్విడ్ ఫ్రాడ్కో అని చెప్పడానికి,అక్రమ ఆస్తుల కేసు అనడానికి ఎవరికీ హక్కు లేదు,కానీ అదే చెప్తూ జనం లో విష బీజాలు నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం లో ఏ  పదవిలో లేనప్పుడు క్విడ్ ఫ్రాడ్కో ఎలా అవుతుంది.కాబినెట్.అధికారులు అందరు తప్పు చేసారు,అధికార దుర్వినియోగం జరిగింది అని తేలిన తర్వాత మాత్రమే జగన్ మీద దర్యాప్తు చెయ్యాలి.అది కూడా సాక్ష్యాలు లభించిన  తర్వాత మాత్రమే.జగన్ సక్రమం గా పన్ను కట్టినప్పుడు కూడా గొడవ చేసారు,పన్ను కట్టని వాళ్ళని ,అక్రమ సొమ్ము దొరికిన వాళ్ళని పట్టించుకోరు కానీ జగన్ విషయం లో చాల అన్యాయం గా వ్యవహరిస్తున్నారు .జగన్ సంపాదించిన ఆస్తులు అన్ని చట్టపరం గా సక్రమమైనవే,అన్నిటికి పన్ను  కట్టినవే .జగన్ విషయం లో ఏమి తప్పు దొరకకే సిబిఐ,ఎల్లో మీడియా తిప్పలు పడుతుంది.

జగన్ ని అర్రెస్ట్ చెయ్యడానికి  మాట్రిక్స్ ప్రసాద్ లాంటి వాళ్ళని అర్రెస్ట్ చేసారు, తెలుగు దేశం అధికారం లో వుండగా ప్రసాద్  కొన్ని కోట్ల తో మాట్రిక్స్ ని వేల కోట్లకు తీసుకెళ్ళారు.మా టీవీ లో ఇంకా చాల వాటిలో పెట్టుబడులు పెట్టారు కానీ జగన్ కంపెనీ లలో పెట్టుబడులు పెట్టడమే తప్పు అని చూపిస్తున్నారు.వాన్ పిక్ లో  అల్ కైమా సంస్థకి నష్టం వచ్చిన ప్రభుత్వానికి,ప్రజలను నష్టం వచినట్లు గా మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఎక్కువ శాతం మీడియా జగన్ వ్యతిరేకులతో కలిసి పని చేస్తునది.ఎలా చెప్పుకుంటూ పోతే  ఎంత కుట్ర వుందో అనిపిస్తుంది.వైఎస్సార్ మరణం  మీదే నివేదికలు బహిర్ఘతం చెయ్యలేదు.అయన మరణం మీద  ప్రజలకు గట్టి సందేహాలున్నాయి.

కాంగ్రెస్ తో జగన్  కలుస్తారు అన్నట్లు,సిబిఐ స్లో అయ్యింది అని కావాలని ప్రచారం చేయించి జనం లో జగన్ ని చెడు చెయ్యాలని చూసారు ,కాని జనం నమ్మే పరిస్థితులలో లేరని తెలుసుకున్నారు. ఈరోజు చంద్రబాబు పాదయాత్ర అంటూ తన పాలన గురించి  ప్రజలు  మరిచిపోయారు అని అనుకుంటున్నాడు.కానీ అంత దుర్మార్గపు పాలనను జనం ఎప్పటికి మర్చిపోలేరు.ఏ పార్టీ తో కలవాలన్న చంద్రబాబు కే సాధ్యం ,ఈరోజు సిబిఐ ,కాంగ్రెస్ తో కలిసి  " చంద్రబాబు (కాంగ్రెస్) బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"  గా మార్చారు.ఇప్పుడు ఈడి తో కూడా కుమ్మక్కు అయ్యి చంద్రబాబు పాదయాత్ర అయ్యేదాకా జగన్ కు బెయిల్ రాకుండా చెయ్యాలని ప్రయత్నం  చేసారు .ఎన్ని కుట్రలు చేసిన జగన్ మీద జనానికి ఉన్న అభిమానం ,నమ్మకం పెరుగుతూనే  ఉంది.

  కాంగ్రెస్ కి లొంగలేదు కాబట్టి తెలుగు దేశంతో ఒప్పందం పెట్టుకుని  చంద్రబాబు ఆంధ్ర లో పాదయాత్ర చేసే దాక జగన్ కి బెయిల్ రాకుండా చేస్తున్నారు.తెలంగాణా లో కెసిఆర్ తో బేరసారాలు చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు .జగన్ ని ఒంటరిగా నిలబెడతాం అని కాంగ్రెస్ అధిష్టానం లో కొంతమంది అన్నారని చెప్తున్నారు.దేశం లో అంబానీ....రాష్ట్రము లో మురళీమోహన్,నామా...దేవేందర్ గౌడ్....రాధాకృష్ణ........ఇంకా వందల ,వేల మంది తక్కువ సమయం లో వేల కోట్లు సంపాదించిన వాళ్ళే.కానీ జగన్ టాక్స్  కడుతూ  సక్రమం కొంత సంపాదించుకుంటే వేల కోట్లు,లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేసారు.జగన్ ఒక్కడి మీదే వందల కుట్రలు చేస్తున్నారు.దేశం లో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు.దేవుడున్నాడు మంచి జరుగుతుందని ఎదురుచూడ్డం మాత్రమే కాదు మనం చెయ్యల్సింది వుంది చాలా.

వై ఎస్సార్ ని కూడా చాలా కష్టాలు పెట్టారు.ఆర్ధికం గా,మానసికం గా,రాజకీయం గా నష్ట పరిచారు అయన ఏరోజు తలవంచలేదు.జగన్ ని అదనం గా ఇంకా ఎక్కువ కష్టాలు పెడుతున్నారు ,జగన్ తొణకలేదు,బెదరలేదు .జనం కోసం మాట మీదే నిలబడ్డాడు.అయన అనుకుంటే దర్జాగా విలాసం బతుకుతూ కాంగ్రెస్ అధిష్టానానికి లొంగి వుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు.కానీ తెలుగువాడి ఆత్మ గౌరవం ,మాట కోసం కష్టాలను బరిస్తున్నాడు.

తెలుగువాడి ఆత్మ గౌరవం అని నందమూరి తారకరామారావు పార్టీ పెడితే ఆయన వారసులు ఈరోజు ఢిల్లీ కి అమ్ముడు పోయారు.
గ్రామ స్థాయిలో పార్టీ బలపడకుండా స్తానిక సంస్థల ఎన్నికలు రాకుండా చేసారు. 
ఇప్పుడు మనం చెయ్యల్సింది పార్టీ కోసం పని చెయ్యడం.   పార్టీ కి జన బలం ఏ పార్టీ కి లేనంత వుంది,కానీ నడిపించే నాయకత్వం పూర్తిగా ఏర్పడలేదు.కష్టపడి,ఇష్టపడి పని చెయ్యాల్సిన సమయం ఇది.జనం లోకి వెళ్లి కష్టపడదాం.జనానికి అండగా నిలబడదాము.పార్టీ కోసం సైనికులమై పని చేద్దాం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!