YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 4 October 2012

జగన్ కు మేలు జరగాలని ప్రత్యేక పూజలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేలు జరగాలని ఆక్షాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టులో జగన్ కు బెయిల్ రావాలంటూ ఖమ్మంజిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ద ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంబాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహస్వామికి పూజలు జరిపారు.

అలాగే శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్యదేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. జగన్‌ త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

కరీంనగర్ లో జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుంచి మంకమ్మ తోట వరకూ పాదయాత్ర చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు పొర్లు దండాలు పెట్టారు. కాగా జగన్ క్షేమం కోరుతూ హైదరాబాద్ లో అంబర్ పేట నుంచి జీడీ కాలనీ వరకు వైఎస్ఆర్ సీపీ నేతల ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!